సత్వర పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపండి

May 27 2025 7:34 AM | Updated on May 27 2025 7:34 AM

సత్వర పరిష్కారం చూపండి

సత్వర పరిష్కారం చూపండి

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ నగేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులను పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. భూ సమస్యలపై 19, పెన్షన్ల కోసం 3, డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 1, ఇతర సమస్యలపై 29 కలిపి మొత్తం 52 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, ఏఓ యూనస్‌తో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేష్‌

ప్రజావాణికి 52 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement