
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆదిలాబాద్రూరల్: గత నెల 29న మావల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కుడ్మేత దత్తు (23) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సీఐ కర్రె స్వామి తెలిపిన ప్రకారం వివరాలు.. మావల మండలంలోని వాఘపూర్ గ్రామానికి చెందిన దత్తు ఆటో ట్రాలీతో భోరజ్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మావల శివారులో రోడ్డుకు పక్కన వాహనాన్ని నిలిపి ఆటోపై ఉన్న పరద సరి చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు అతడిని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దత్తుకు తీవ్ర గాయాలవగా వెంటనే స్థానికులు రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు అదే రోజు హైదరాబాద్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను కుటుంబసభ్యులు సోమవారం మళ్లీ రిమ్స్కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతి చెందినట్లు సీఐ తెలిపారు.