జూరాలకు తగ్గిన వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు తగ్గిన వరద

Jul 3 2025 4:41 AM | Updated on Jul 3 2025 4:41 AM

జూరాలకు తగ్గిన వరద

జూరాలకు తగ్గిన వరద

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 87 వేల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం సాయంత్రానికి 67 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్టు 5 క్రస్ట్‌గేట్లను ఎత్తి 32,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 31,380 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్‌–1కు 650, ఆవిరి రూపంలో 42, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 280, ఆర్‌డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 450, భీమా లిఫ్ట్‌–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.060 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.

174.784 మి.యూ. విద్యుదుత్పత్తి..

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 79.443 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 95.341 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. రెండు ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 174.784 మి.యూ. విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement