
జాడలేని వరుణుడు
తొలకరి వర్షాలకు విత్తనాలు నాటిన రైతులు
●
జూలై 20 వరకు..
ఈ నెలలో సుమారు 60 మి.మీ., నుంచి 70 మి.మీ., వరకు వర్షపాతం నమోదైన పడిన తర్వాతే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అప్పుడు విత్తనాలు నాటితే మంచి మొలకలు వస్తాయి. జూన్ 15 నుంచి జూలై 15 వరకు పత్తి విత్తనాలు వేసుకునేందుకు సమయం ఉంది. జూలై 20 వరకు కూడా వేసుకోవచ్చు. రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు నాటుకోవాలి. నాణ్యమైన వాటిని కొనుగోలు చేయాలి. అలాగే రశీదులు, విత్తన పాకెట్ కవర్లను రైతులు భద్రపరుచుకోవాలి.
– వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మహబూబ్నగర్ రూరల్ మండలం పోతన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల నరేష్
12 రోజుల క్రితం తన రెండెకరాల పొలంలో పత్తి విత్తనాలు నాటాడు. ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు వాడుముఖం పట్టడంతో బోరుబావి ద్వారా ిస్ప్రింక్లర్లు నీటి తడులు అందిస్తూ మొక్కలను కాపాడుకుంటున్నాడు. ఒకవేళ సొంతంగా బోరుబావి లేకుంటే పత్తి మొలకలు ఎండిపోయి.. తీవ్రనష్టం వాటిల్లేదని రైతు చెప్పుకొచ్చాడు.
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో వర్షాధార పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందస్తుగా మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేశాడు. ఈ ఏడాది రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోకి నైరుతి పవనాలు ముందుగానే ప్రవేశించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. వారం రోజులపాటు వానలు విస్తారంగా కురవడంతో రైతన్నలు పొలంబాట పట్టారు. దుక్కులు దున్ని.. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోగా.. కొందరు పత్తి విత్తనాలు నాటారు. విత్తనాలు మొలకెత్తే దశలో ఉండగా.. వరుణుడు ముఖం చాటేయడంతో నీరు అందక.. మొలకలను భూమిపై మొలిపించుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా వాన జాడ లేకపోవడంతో రైతులకు ఆదిలోనే కష్టాలు ఆరంభమయ్యాయి. ఎండలు భగ్గుమంటుండటంతో.. మొలకలు వాడిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు.
చినుకు.. చింత
ఎండలు, వడగాలులతో
వాడుబడుతున్న మొక్కలు
పంటను కాపాడుకునేందుకు
అన్నదాతల అష్టకష్టాలు
నాలుగైదు రోజుల్లో వర్షం
రాకపోతే తీవ్రనష్టమే..
ఆకాశం వైపు
ఆశగా చూస్తున్న రైతాంగం

జాడలేని వరుణుడు

జాడలేని వరుణుడు