
చదువుతోనే బంగారు భవిష్యత్కు బాటలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ముదిరాజ్ బిడ్డలు బాగా చదువుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో పదో తరగతిలో ఏ–గ్రేడ్ సాధించిన ముదిరాజ్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో ముందంజ వేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించి అత్యధిక జనాభా ముదిరాజులదే అని గణాంకాలతో నిరూపించింది అని పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు చైర్మన్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అద్యక్షుడు జగన్మోహన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి సంజీవ్, జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అఽ ద్యక్షుడు నారాయణ, నాయకులు పుష్పలత, శ్రీనివాస్, మనోహర్, బాలప్ప, పరమేశ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.