
ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు
వనపర్తి రూరల్: పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం మహిళలు సిగపట్లు పట్టారు. బస్సులో సీటు కోసం మహిళల మధ్య మొదలైన గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. తోటి ప్రయాణికులతో పాటు బస్సు కండెక్టర్ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. మహిళల మధ్య గొడవ తారస్థాయికి చేరుకోవడంతో రూరల్ పోలీస్స్టేషన్ వద్ద బస్సును డ్రైవర్ నిలిపారు. గొడవకు దిగిన మహిళలను బస్సులో నుంచి దించి అందరూ సర్దిచెప్పడంతో శాంతించారు. అదే బస్సులో బస్టాండ్కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎస్ఐ జలేందర్రెడ్డిని వివరణ కోరగా.. బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.