
ప్లాస్టిక్ రహితం
మైసమ్మ అడవి
అటవీ సంరక్షణకు ప్రభుత్వం చర్యలు
నవాబుపేట: నల్లమల అటవీ ప్రాంతం సరసన పర్వతాపూర్ మైసమ్మ అడవి నిలుస్తోంది. అక్కడ పెద్దపులులు ఇతర వన్యప్రాణులు ఉండగా.. ఇక్కడ చిరుతలకు ఆవాసంగా అటవీ ప్రాంతం ఉంది. అయితే అటవీ ప్రాంతాల్లోని మార్గాల్లో ప్రయాణించే వారు ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తుండటంతో వన్యప్రాణ్యుల మనుగడకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్లాస్టిక్ రహితంగా అడవులను తీర్చిదిద్దాలని సంకల్పించింది. నల్లమల తరహాలోనే మైసమ్మ అడవిని సైతం ప్లాస్టిక్ రహితంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రస్థాయిలో పర్వతాపూర్ మైసమ్మ అడవిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి ఆది, మంగళవారాల్లో మైసమ్మ దర్శనానికి వేలాది భక్తులు వస్తుంటారు. ఇతర రోజుల్లో సైతం అడవిలో రద్దీ ఉంటోంది. ఈ తరుణంలో అడవి సంరక్షణ కోసం అందరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధం పాటించాల్సిన అవసరం ఉంది.
నల్లమలను తలపిస్తున్న మైసమ్మ అడవి
అందరూ సహకరించాలి..
మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలో వేయొద్దు. ఆలయ ఆవరణలోని వ్యాపారులు సైతం ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలి. అడవిలో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు అందరూ సహకరించాలి.
– జగన్మోహన్రెడ్డి, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్
●

ప్లాస్టిక్ రహితం