
9,10 తేదీల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ మహిళా క్రికెట్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా అండర్–23, అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మహిళా క్రికెట్ లీగ్ పోటీలకు శ్రీకారం చుట్టారు.
9, 10 తేదీల్లో మహిళా క్రికెట్ లీగ్
ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 9,10 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. లీగ్లో పాల్గొనే జట్లను ఈనెల 1న ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో పరీక్షించి క్రీడాకారిణులను ఎంపిక చేశారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది.
లీగ్ మ్యాచ్ల వివరాలు..
క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే మహిళా క్రీడాకారిణులను మూడు జట్లుగా విభజించారు. 30 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈనెల 9న రెడ్–బ్లూ జట్లు, బ్లూ–పింక్ జట్లు, 10న పింక్–రెడ్ జట్లు లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి.
బ్లూ మహిళా జట్టు.. మంజుల (కెప్టెన్), స్వాతి, కరీనా, మనీషా, ప్రవళిక, శ్రవంతి, దివ్య, నిర్మల, తనుజశ్రీ, తేజశ్రీ, శారద, సాయిశృతి, సాయి ప్రణవి, స్పందన, సంజన.
రెడ్ జట్టు... అనిత (కెప్టెన్), అక్షర రాథోడ్, వైశాలి, అనూష, మహేశ్వరి, మంజు, ప్రతీక, మీనాక్షి, సింధూజ, కీర్తన, గోపిక, యూ.కీర్తన, నందిని, లోకేశ్వరి, భానుమతి.
పింక్ జట్టు.. త్రివేణి (కెప్టెన్), ఇందు, నిహారిక, చంద్రకళ, పవిత్ర, రిషికాసాయి, ఎన్.కవిత, మనీషా, వెన్నెల, శైలు, మేఘన, ఎం.నందిని, మౌనిక, పద్మ, ఐశ్వర్య.
మూడు జట్లతో లీగ్ నిర్వహణ
లీగ్లో అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత