
ప్రతిభచాటిన ‘వాగ్దేవి’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని వాగ్ధేవి కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఈ మేరకు కళాశాల విద్యార్థిని అశ్విని జాతీయ స్థాయిలో 2,610 ర్యాంకు సాధించింది. ఆమెను కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు రాబట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ ఇన్చార్జ్ పావనిరెడ్డి, అధ్యాపకులు యాకుబ్, గోవిందరాజులు, సందీప్, మహేష్గౌడ్, రాంరెడ్డి పాల్గొన్నారు.