
మూడేళ్లలో పాలమూరు పూర్తి
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు.
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
నిధులు ఆవిరైనా నీళ్లు రాలేదని..కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్పల్లి లిఫ్ట్కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
దోపిడే లక్ష్యంగా పనిచేశారు
బీఆర్ఎస్ హయాంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, దోపిడే లక్ష్యంగా పనిచేసి అంతా దోచుకున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి విమర్శించారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే చెరువుల్లో ఒండ్రుమట్టి అమ్ముకుని రూ.కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. చెక్కులు మంజూరైన వారు కండువాలు కప్పుకొంటేనే బీఆర్ఎస్ నాయకులు చెక్కులు ఇచ్చారని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ వారికి అండగా ఉంటున్నామన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.
పారిశ్రామిక రంగంలో పరుగులు
జడ్చర్ల పారిశ్రామిక రంగంలో మరింత ముందుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికతో విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. గత పాలకులు ముందు వారి స్వార్థం చేసుకుని.. ఆ తర్వాత మిగతా పనులు చేసేవారని, తాను మాత్రం అలా కాదని, ప్రజాసేవకుడినని వివరించారు. తన పట్టుదలతోనే ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.72 కోట్లు ప్రత్యేకంగా వచ్చాయన్నారు. పదేళ్లలో అభివృద్ధి కోసం రూ.120 కోట్లు వెచ్చిస్తే.. తాను కేవలం ఏడాదిన్నరలోనే రూ.181 కోట్లు మంజూరు చేయించానన్నారు.
దెయ్యాలను గ్రామాల్లోకి రానివ్వొద్దు
పదేళ్లు తెలంగాణను పట్టి పీడించిన దెయ్యాలను గ్రామాల్లోకి రానివ్వొద్దని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. తమ వారు దెయ్యాల ని సొంత పార్టీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ పల్లెల్లో ఆంజనేయస్వామి గుడి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రతాప్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప, వ్యవసాయాధికారులు వెంకటేష్, కృష్ణకిషోర్, నాయకులు అరవింద్రెడ్డి, నాగిరెడ్డి, శెట్టిశేఖర్, శ్రీహరి, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వర్, బాల్నర్సింహులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల చేస్తాం
చౌదర్పల్లి లిఫ్ట్కు త్వరలో అనుమతులిస్తాం
తెలంగాణ రైజింగ్ను ఆపలేరు

మూడేళ్లలో పాలమూరు పూర్తి

మూడేళ్లలో పాలమూరు పూర్తి

మూడేళ్లలో పాలమూరు పూర్తి