ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ

Jun 7 2025 12:25 AM | Updated on Jun 7 2025 12:25 AM

ఆర్టీ

ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ చెప్పారు. శుక్రవారం ఆర్‌ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్‌ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్‌నగర్‌ డిపో మేనేజర్‌ (ఫోన్‌ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు

ఈ నెల 27వ తేదీన ప్రారంభం: ఆర్‌ఎం

ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ 1
1/1

ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement