
నువ్వా.. నేనా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన అనంతరం సుమారు ఆరు నెలల వరకు గద్వాల జిల్లా కాంగ్రెస్లో పెద్దగా లుకలుకలు లేవు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, బండ్ల బీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2023 ఎన్నికల ముందు సరిత కాంగ్రెస్లో చేరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. బండ్ల చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. నియోజకవర్గంలో ఆమెదే పైచేయిగా నిలిచింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని మంత్రి జూప ల్లి కాంగ్రెస్లో చేర్పించారో.. అప్పటి నుంచి వర్గ పోరు మళ్లీ మొదలైంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటనలో ఎమ్మె ల్యే ఏ పార్టీలో ఉన్నారంటూ సరిత వర్గీయులు నినాదాలు చేయడం, ప్రతిగా బండ్ల వర్గం వాదనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి.. సరితకు ఎంపీ మల్లురవి అండదండలు ఉ న్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్లో నేతల మధ్య తారస్థాయికి ఆధిపత్య ‘పోరు’
● ఇప్పటికే గద్వాలలో సరిత, ఎమ్మెల్యే బండ్ల మధ్య వైరం
● తాజాగా తెరపైకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్..
● సరిత ఇంట్లో తేనేటి విందుకు హాజరుకావడంపై దుమారం
● ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గీయుల మండిపాటు
● పలువురికి షోకాజ్ నోటీసులు.. ప్రతిగా ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు
● పోటాపోటీ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నువ్వా.. నేనా అన్నట్లు నేతల మధ్య ఆధిపత్య పోరుతో జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య వైరం ఇదివరకే పార్టీ అధిష్టానానికి సంకటంగా మారగా.. ఇటీవల అలంపూర్ సెగ్మెంట్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్ మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరిత ఇంట్లో తేనీటి విందుకు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి.. విజయుడిని వెంటబెట్టుకుని వెళ్లడంతో వివాదం తలెత్తింది. దీంతో మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ఉన్న వైషమ్యాలు వీధికెక్కాయి. ఈ క్రమంలో పలువురు యువజన నాయకులకు షోకాజ్ నోటీసుల జారీ.. ప్రతిగా ఎంపీ వైఖరిపై సంపత్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటి పోటాపోటీ పరిణామాలు కాంగ్రెస్ను కుదిపేస్తున్నాయి.
తెరదించే ప్రయత్నం.. అంతలోనే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎపిసోడ్ కాంగ్రెస్ లో కలకలం సృష్టించగా.. వివాదంపై ఎంపీ మల్లు రవి స్పందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాధృచ్ఛికంగా సరిత ఇంట్లో తేనేటి విందుకు విజయుడితో కలిసి హాజరయ్యామని.. మా మధ్య రాజకీయ పరమైన చర్చలు జరగలేదని వీడియోను పోస్టు చేశారు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కల్పితాలేనంటూ కొట్టిపారేశారు. తాను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని చెప్పారు. ఎంపీ స్పందనతో వివాదం సద్దుమణిగిందని భావిస్తు న్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ వర్గీయులైన యువజన కాంగ్రెస్ నాయకులు కోల నర్సింహ, వరకుంట్ల గణేష్, కేఎంఆర్ యేసు, కాశపోగు శేఖర్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం మళ్లీ మలుపు తిరిగినట్లయింది. ప్రతిగా సంపత్ తన వర్గీయులతో కలిసి మల్లురవితో పాటు సరితపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు పలువురు నాయకులు సంతకాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇప్పించి.. వారి నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేసినట్లు ఎంపీపై ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజాభిప్రాయా నికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం మరింత సెగ రాజేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో గద్వాల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
నడిగడ్డలో ‘హస్త’వ్యస్తం
గద్వాల