లీగ్‌లో మహబూబ్‌నగర్‌ శుభారంభం | - | Sakshi
Sakshi News home page

లీగ్‌లో మహబూబ్‌నగర్‌ శుభారంభం

Jun 3 2025 5:41 AM | Updated on Jun 3 2025 5:41 AM

లీగ్‌లో మహబూబ్‌నగర్‌ శుభారంభం

లీగ్‌లో మహబూబ్‌నగర్‌ శుభారంభం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థస్కూల్‌ మైదానంలో సోమవారం ప్రారంభమైన అండర్‌– 19 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు శుభారంభం చేసింది. 169 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు 50 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టు క్రీడాకారుడు యువన్‌ ముద్దనూరి అద్భుతమైన బ్యాటింగ్‌తో 93 బంతుల్లో 1 సిక్స్‌, 6 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మరో క్రీడాకారుడు మనోజ్‌యాదవ్‌ 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. వనపర్తి బౌలర్లు చరణ్‌ 4, పరమేశ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు మహబూబ్‌నగర్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 28.2 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులో మహేష్‌ నాయక్‌ 28, మాజ్‌ ఫర్షాద్‌ 26 పరుగులు చేశారు. పాలమూరు బౌలర్‌ మనోజ్‌యాదవ్‌ 8 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, అంకిత్‌రాయ్‌ 2, రాహుల్‌ 2 వికెట్లు తీశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌– నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య రెండో లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది.

లీగ్‌లో ప్రతిభ చాటాలి..

క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్‌– 19 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అన్నారు. లీగ్‌ మ్యాచ్‌ను గెలిచిన మహబూబ్‌నగర్‌ జట్టును అభినందించారు. ఓడినవారు నిరాశ చెందకుండా గెలుపు కోసం పట్టుదలతో ఆడాలని సూచించారు. అండర్‌–19 లీగ్‌లో రాణించే క్రీడాకారులను త్వరలో జరిగే హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. లీగ్‌లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోచ్‌ అబ్దుల్లా, సీనియర్‌ క్రీడాకారుడు రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

169 పరుగుల తేడాతో వనపర్తిపై గెలుపు

రాణించిన యువన్‌, మనోజ్‌యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement