
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
నవాబుపేట: మైసమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న బొలెరో వాహనంలో ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పెను ప్రమాదం తప్పిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. ఆదివారం కోస్గి మండలం ముస్రిఫా గ్రామానికి చెందిన నరేష్ కుటుంబంతో కలిసి మైసమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరి వచ్చారు. వారు జిల్లా కేంద్రం దాటి మైసమ్మ అడవిలోకి ప్రవేశించి దేవాలయానికి మరో 150 మీటర్ల దూరంలో వాహనంలో షాట్సర్క్యూట్ వల్ల పొగలు, మంటలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనం ఆపి అందరిని వెంటనే కిందికి దించాడు. వాహనంలో వంట సామన్లు తీస్తుండగానే మంటలు చెలరేగాయి. దీంతో వారు ఫై్ర్ సిబ్బందికి సమాచారం అందించారు. వాహనం క్యాబిన్లో వంటకోసం తెచ్చిన గ్యాస్ సిలిండర్కు మంటలు అంటుకొని పెద్దశబ్దంతో పేలిపోయింది. దీంతో అందరు భయబ్రాంతులకు గురయ్యారు. శబ్దానికి అడవిలో బాంబు పేలినట్లు శబ్ధం వచ్చింది. రోడ్డుపై ఉన్న వారంత పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసినా అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్త్న్ను వారంతం త్వరగా తేరుకోవటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
మైసమ్మ అడవిలో బొలెరో వాహనం దగ్ధం

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం