వినియోగం వెనుక ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వినియోగం వెనుక ప్రమాదం

Jun 8 2025 1:57 AM | Updated on Jun 8 2025 1:57 AM

వినియ

వినియోగం వెనుక ప్రమాదం

ఖిలా వరంగల్‌ : మార్కెట్లోకి వెళ్లిన వెంటనే ప్రధానంగా ఆకర్షించేవి ప్లాస్టిక్‌ బాటిళ్లు. రంగు బాగుందనో.. ఆకృతి బాగుందనో.. ధర తక్కువనో.. ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రతి ఇంటిలోనూ ఇవే దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో వరంగల్‌ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో ప్లాస్టిక్‌ బాటిళ్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే వాటి వినియోగం వెనుక ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ప్లాస్టిక్‌ బాటిళ్లను సక్రమంగా శుభ్రం చేయకుంటే రోగాల బారిన పడడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్లాస్టిక్‌ బాటిళ్ల ద్వారా నీరు తాగుతున్నారు. నేడు ఏ అవసరరానికైనా ప్లాస్టిక్‌ బాటిళ్లు తప్పనిసరి అయ్యాయి. తాగునీరు, మజ్జిగ, శీతల పానీయాలు.. ఇలా ఏది తాగాలన్నా .. కొనాలన్నా.. ప్రజలు వాటిపైనే ఆధారపడుతున్నా రు. అయితే వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నా.. శుభ్రం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మినరల్‌ ప్లాంట్‌లో చల్లటి నీరు ఇచ్చే డబ్బాలు శుభ్రపర్చకుండానే సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని తాగడంతోనే జ్వరం, గొంతునొప్పి, జలుబుకు గురవుతున్నారు. ఫలి తంగా రోగాలు కొని తెచ్చుకుంటున్నాం.

ప్లాస్టిక్‌ బాటిళ్లను తరచూ శుభ్రం చేయాలి..

నిత్యం వినియోగించే ప్లాస్టిక్‌ బాటిళ్లను తరచూ శుభ్రం చేయాలి. లేనిపక్షంలో వాటి అడుగు భాగంలో జిడ్డు పదార్థం ఏర్పడుతుంది. దీనిలో బ్యాక్టీరియా చేరి పెద్ద ఎత్తున వృద్ధి చెందుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జీర్ణకోశ, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా నాసిరకం ప్లాస్టిక్‌తో తయారయ్యే బాటిళ్లలో సులభంగా నీరు కలుషితమవుతుంది. ఇదిలా ఉండగా మినరల్‌ వాటర్‌ క్యాన్లతో వ్యాధులు వస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాటర్‌ క్యాన్లను నిర్వాహకులు పెద్దగా శుభ్రం చేయరు. ఇలాంటి క్యాన్లను వినియోగించడం కన్నా స్టీల్‌ బాటిళ్లు, బిందెలు, రాగి పాత్రల్లో నీరు తాగితే ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడొద్దని వారు సూచిస్తున్నారు.

అనర్థాలివే..

ప్లాస్టిక్‌ క్యాన్లు, బాటిళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా చేరుతుంది. వాటిల్లో గోనో కొక్కల్స్‌, న్యూమో కొక్కల్స్‌ వంటి బ్యాక్టీరియా సులభంగా వృద్ధి చెందుతుంది. ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీరు తాగడం వల్ల గొంతు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు జర్వం రావొచ్చు. క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువ..

ప్లాస్టిక్‌ బాటిళ్లు వాడే వారికి సూచనలు

నాణ్యమైన నీటి బాటిళ్లను కొనుగోలు చేయాలి. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించేవి కొనుగోలు చేయొద్దు..రోజు వేడినీటితో బాటిళ్లను శుభ్రం చేసుకోవాలి. బ్రష్‌తో అడుగు భాగం కడగాలి.. పూర్తిగా ఎండేలా చూసుకోవాలి. ఇందులో నీరు ఎక్కువగా నిల్వ లేకుండా చూసుకోవాలి.. బాటిళ్లను తరచూ మారుస్తూ ఉండాలి.

ప్లాస్టిక్‌ బాటిళ్లతో రోగాలు

అడుగు భాగంలో బ్యాక్టీరియా వృద్ధి

రోజు శుభ్రం చేసుకోవాల్సిందే..

లేదంటే ప్రమాదమే..

వ్యాధులను కొని తెచ్చుకోవద్దంటున్న వైద్య నిపుణులు

అప్రమత్తంగా ఉండాలి..

నాసిరకం ప్లాస్టిక్‌ బాటిళ్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లి. పిల్లలు వినియోగించడంలో చూపించే శ్రద్ధ శుభ్రపరచడంలో చూపించడం లేదు. దీంతో బాటిల్‌ అడుగు భాగంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. తద్వారా పిల్లలకు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా జీర్ణకోశ, గొంతు వ్యాధులు వస్తాయి. తరచూ జలుబు వస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్‌ బాటిళ్లు వినియోగించొద్దు.. వాడితే రోజూ శుభ్రం చేయాలి.

– రేవూరి మాధవి, హెచ్‌ఎం,కరీమాబాద్‌ ప్రభుత్వ పాఠశాల వరంగల్‌

తరచూ శుభ్రం చేయాలి..

పాఠశాలలకు వెళ్లే చిన్నారులే ఎక్కువ ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగిస్తుంటారు. వివిధ రూపాల్లో ఉండే వాటికి పిల్లలు బాగా ఆకర్షితులవుతుంటారు. అయితే వాటిని శుభ్రం చేయకపోతే అడుగుభాగంలో ఉండే బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తుంది. క్రమంగా పిల్లలు టైపాయిడ్‌, వాంతులు, విరేచనాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులను నివారించాలంటే బాటిళ్లను వాడకపోవడమే మంచిది.

– డాక్టర్‌ మహ్మద్‌ అజీమ్‌, వరంగల్‌

వినియోగం వెనుక ప్రమాదం1
1/3

వినియోగం వెనుక ప్రమాదం

వినియోగం వెనుక ప్రమాదం2
2/3

వినియోగం వెనుక ప్రమాదం

వినియోగం వెనుక ప్రమాదం3
3/3

వినియోగం వెనుక ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement