వడదెబ్బతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Jun 8 2025 1:57 AM | Updated on Jun 8 2025 1:57 AM

వడదెబ

వడదెబ్బతో వ్యక్తి మృతి

జనగామ: జనగామ పట్టణం బీరప్పగడ్డకు చెందిన నేతి అంతయ్య(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. రోజువారీ పని ముగించుకుని ఇంటికి చేరిన ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతయ్యకు భార్య సుగుణమ్మ, కుమారుడు ఉపేందర్‌, కుమార్తె ఉమ ఉన్నారు.

పాముకాటుతో..

సంగెం: వరంగల్‌ జిల్లా సంగెం మండలానికి చెందిన వ్యక్తి పాముకాటుకు గురై ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన చాగంటి యాకయ్య(56) వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటున్నాడు. నెల రోజుల క్రితం సైకిల్‌పై నుంచి పడిన యాకయ్య ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనాల అనంతరం ఇంటి ముందున్న రేకుల షెడ్‌ కింద యాకయ్య, అతని కుమారుడు రంజిత్‌ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున యాకయ్య ఏదో కుట్టినట్లయిందని కుమారుడు రంజిత్‌కు తెలియజేశాడు. పరిశీలించగా.. బొడ్డు కింద, పురుషాంగంపైన పాము కాటు వేసినట్లు కన్పించింది. చుట్టుపక్కల వారి సాయంతో వెతకగా.. కట్ల పాము కన్పించింది. దీంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శనివారం ఉదయం యాకయ్య మృతి చెందాడు. కుమారుడు రంజిత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

భూమి కబ్జా చేశారని దివ్యాంగుడి ఆందోళన

పాలకుర్తి టౌన్‌: భూమిని కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని మండుటెండలో దివ్యాంగుడు ఆందోళన చేసిన సంఘటన శనివారం జ నగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో చోటు చేసుకుంది. మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగు డు రూపాని సాలయ్య 16 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిని కజ్జా చేశారని తన కు న్యాయం చేయాలని మండల కేంద్రంలోని ఆందోళన చేశాడు. ఈ సందర్భంగా దివ్యాంగు డు సాలయ్య మాట్లాడుతూ మల్లంపల్లి గ్రా మానికి చెందిన చింతం మహేందర్‌ వద్ద 5.20 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తన భార్య యాదమ్మ పేరున రిజిస్ట్రేషన్‌ కూడా చేయించానని తెలిపాడు. ఇప్పడు అదే గ్రామానికి చెందిన చింతం వెంకన్న అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నాడని త నకు నాయ్యం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి
1
1/2

వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి
2
2/2

వడదెబ్బతో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement