
తరగతి గదుల కొరత
కురవి: మండలంలోని కందికొండ ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలు లేవు. ప్రస్తుతం మూడు తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో రెండు తరగతి గదులు అవసరం. మిగిలిన తరగతుల విద్యార్థులకు వరండాలోనే చదువులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కిచెన్ షెడ్డు లేదు. దీంతో ఆరుబయట వంటవండాల్సిన పరిస్థితి ఉంది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో రక్షణ లేకుండా పోయింది. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపికై న ఈ పాఠశాలకు గత ఏడాది రూ.2.30లక్షలు కేటయించగా.. రూ.లక్ష వచ్చాయి. మిగిలినవి రాలేదని పాఠశాల హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. పాఠశాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు.

తరగతి గదుల కొరత