గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం

Jun 7 2025 1:24 AM | Updated on Jun 7 2025 1:24 AM

గంజాయి స్వాధీనం

గంజాయి స్వాధీనం

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపల్‌ పరిధి బాపూజీనగర్‌ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఇద్దరు యువకుల నుంచి శుక్రవారం పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్‌ ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం.. బాపుజీనగర్‌లో యడమల్ల పవన్‌కుమార్‌, పిల్లి ఈశ్వర్‌ అనే యువకులు గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సై ఉమ, హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వర్‌రావు, సిబ్బంది సైదులు, శ్రావణ్‌ వారిని గమనించారు. వారి వద్ద నుంచి 64.17 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, మహబూబాబాద్‌ శివారు పత్తిపాక గ్రామానికి చెందిన డానీ అలియాస్‌ డానీ ఈశ్వర్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు పట్టుబడిన యువకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement