
బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి
తొర్రూరు: ప్రభుత్వ బడుల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బడి బాట ప్రచార జాతాను మంగళవారం డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో డీఈఓ ప్రారంభించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి డీఈఓ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు అందరి సహకారం అవసరమన్నారు. సామాజిక దృక్పథంతో ఉపాధ్యాయ సంఘాలు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యాశాఖ, ఉపాధ్యాయుల కృషితోనే పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్, ఎంఈఓ బుచ్చయ్య, యూటీఎఫ్ నాయకులు షేక్ యాకూ బ్, నామ వెంకటేశ్వర్లు, నాగమల్లయ్య, జనార్దనాచారి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్రెడ్డి