
అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు..
● చెరువులో ఈతకు వెళ్లి చిన్నారి మృతి
● చిన్న ముప్పారంలో ఘటన
నెల్లికుదురు: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి అనంతలోకాలకు చేరాడు. స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో చోటు చేసుకుంది. స్థా నికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్సంపల్లి సాయికుమా ర్, సంధ్య దంపతుల మహబూబాబాద్లో ఉంటున్నారు. వీరికి ఇద్ద రు కుమారులు. మూడు రోజులు క్రితం అమ్మమ్మతో కలిసి చిన్నముప్పారం వచ్చిన సాయికుమార్, సంధ్య దంపతుల కుమారుడు బాహు భరత్తేజ్ (9) సోమవారం స్నేహితులతో కలిసి ఈత కోసం చెరువు వద్దకు వెళ్లాడు. అయితే బాహు భరత్తేజ్ ఈత రాకుండానే చెరువులో దూకాడు. దీంతో స్నేహితులు భయపడి వెళ్లిపోగా బాహు భరత్ తేజ్ నీటిలో మునిగాడు. ఈ విషయం తెలియక బాహు భరత్తేజ్ తాత వెంకటయ్య చేపలకోసం అదే చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో తన మనవడి దుస్తులు చూసి చట్టుపక్కల వారిని పిలిచి చూడగా బాహు భరత్ తేజ్ అప్పటికే మృతి చెందాడు. దీంతో వెంకటయ్య.. తన మనువడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించాడు.
గేదెను తప్పించబోయి..మృత్యుఒడికి
● బైక్ అదుపు తప్పి యువకుడి దుర్మరణం
● ఈదులపూసపల్లి శివారులో ఘటన
మహబూబాబాద్ రూరల్ : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు గేదెను తప్పించబోయిన మృత్యుఒడికి చేరాడు. ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందడపడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వి.దీపిక సోమవారం వివరాలు వె ల్లడించారు. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన చిల్పూరి హరీశ్ (23) మానుకోటలోని ఆరోగ్య ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా ఆదివారం తన ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి మీదుగా వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో గేదె అడ్డురావడంతో తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలుకాగా వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. ఈఘటనపై మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇన్నోవేషన్ హబ్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్గా కిరణ్కుమార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కే హబ్లోని ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంప్లాయిబులిటీ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్గా క్యాంపస్లోని వర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.కిరణ్ఉమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు.

అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు..