వీరన్న సన్నిధిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

Jun 2 2025 1:23 AM | Updated on Jun 2 2025 1:23 AM

వీరన్

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

కురవి: వేసవి సెలవులు.. ఆదివారం కావడంతో మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలో నిలుచున్నారు. దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోగా ఆలయ అధికారులు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు.

జాతీయ సదస్సుకు ఎంపిక

మహబూబాబాద్‌ అర్బన్‌: ఈ నెల 26, 27తేదీల్లో న్యూఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) నిర్వహించనున్న సదస్సుకు భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు వి.గురునాథరావు రూపొందించిన పరిశోధన ప్రాజెక్ట్‌ ఎంపికై ంది. గురునాథరావు రూపొందించిన ప్రాజెక్టు ‘హ్యాండ్స్‌ ఆన్‌ ఫిజిక్స్‌’ను సదస్సులో ప్రదర్శిస్తారు. కాగా రాష్ట్రం నుంచి గురునాథరావు మూడోసారి ప్రదర్శనకు ఎంపికయ్యారు. 2018, 2022లో ఎన్‌సీఈఆర్టీ సదస్సుల్లో అవార్డులు అందుకున్నారు. ఆయన ఎంపికపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మేడారంలో విత్తన పండుగ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో పూజారులు విత్తన పండుగ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క పూజారులు, స్థానిక ఆదివాసీలు గ్రామంలోని గ్రామ దేవతలను పసుపు, కుంకుమలతో అలకరించి కంకణాలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో పూజారుల కుటుంబీకులు, గ్రామస్తులు వన భోజనలకు వెళ్లారు. వనంలో కొత్త పందిరి వేసి పసుపు, కుంకుమలు, సార ఆరగించి ప్రకృతి దేవతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు, ఆదివాసీ పెద్దలు విత్తనాలు నాటేందుకు ముందుగా వర్షాలు ఏ కార్తెలో బాగా కురుస్తాయని కొత్త మట్టి కుండలో నీటిని పోసి ఒక్కొక్క కార్తె పేరు చెబుతూ ఇప్పపూలను వదులుతారు. నీటిలో ఇప్పపువ్వు తేలితే వర్షాలు అనుకూలంగా కురుస్తాయని ఆదివాసీలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయంగా విత్తన పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు తెలిపారు. అనంతరం వనంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. విత్తన పండుగతో మేడారంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన మునీందర్‌, కొక్కెర కృష్ణయ్య, మహేశ్‌, భోజరావు, సిద్ధబోయిన రమేశ్‌, సిద్ధబోయిన స్వామి, వసంతరావు, దశరథం, గ్రామస్తులు పాల్గొన్నారు.

డొనేషన్ల వసూలుపై

చర్య తీసుకోవాలి

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు కల్పిస్తూ డొనేషన్లు వసూలు చేస్తున్నారని, సదరు కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఇ.పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు ఇవ్వడం సరికాదని సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌ కుమార్‌, బాధ్యులు శంకర్‌ పాల్గొన్నారు.

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల చేయాలి

గార్ల: గార్ల రైల్వేస్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదల చేయాలని కోరుతూ ఆదివారం యూనియన్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ రైల్వేస్‌ సోమన్నకు రైల్వే డీఆర్‌యూసీసీ మెంబర్‌ జర్పుల లచ్చిరాంనాయక్‌ వినతిపత్రం అందజేశారు. అనంతరం సోమన్నను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
1
1/3

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
2
2/3

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
3
3/3

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement