
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
● ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరాంనాయక్
రామన్నపేట : తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్ప డుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మట్టెవాడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ చూపుతూ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన వెంకటి రామ్ గోద్మారే, ఇదే రాష్ట్రం యవత్మాల్ జిల్లా ఇందిరానగర్కు చెందిన షెరాలీ సయ్యద్ మోతీ పరిచయస్తులు. బోళ్ల (స్టీల్, అల్యుమినియం గిన్నెలు) వ్యాపారైన గోద్మారే.. ఆ సామగ్రి అమ్మకంతో వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2008 నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 20కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. షెరాలీ సయ్యద్ మోతీ కూడా జల్సాలకు అలవాటు పడి అక్కడి సుపారీ గ్యాంగ్లో చేరాడు. 2019లో ఓ మర్డర్ కేసులో మహారాష్ట్రలోని అమరావతి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో వెంకటి గోద్మారేతో పరిచయం ఏర్పడింది. దీంతో గోద్మారే సలహా మేరకు 2022లో ఇద్దరు కలిసి తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డారు. రాయ్పూర్ జైలుకు వెళ్లి తిరిగి మే 01, 2024న విడుదలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్పై ఉండడంతో జల్సాలు, లాయర్కు డబ్బులు ఇవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈనెల 11న రైలులో వరంగల్కు చేరుకుని నగరంలోని బ్యాంకు కాలనీ –2లోని శాంతినగర్లో బయ్య స్వామి అనే వ్యక్తి ఇంటి తాళం పగులకొట్టి 9 తులాల బంగారం, రూ. వెయ్యి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గాలించి పట్టుకున్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మట్టెవాడ ఎస్హెచ్ఓ గోపి, ఎస్సై నవీన్కుమార్, కానిస్టేబుళ్లు హరికాంత్, మీర్ మహ్మద్ అలీ, రాజేశ్,ఏఏఓ మహ్మద్ సల్మాన్ పాషా, నగేశ్రెడ్డి, ప్రవీణ్ను ఏసీపీ అభినందించారు.
కాసుల పెట్టె గలగల..
● ఆర్టీసీ పుష్కర ఆదాయం రూ.6.29 కోట్లు
● 5,047 ట్రిప్పుల ద్వారా 4,36,189 భక్తుల
చేరవేత
హన్మకొండ: సరస్వతీనది పుష్కరాలకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ ప్రత్యేక బస్సుల నడిపి రూ.రూ.6,29,94,460 ఆదాయం రాబట్టుకుంది. ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతినదీ పుష్కరాలకు వరంగల్ రీజియన్లోని ఆయా బస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరవేసింది. 5,047 ట్రిప్పుల ద్వారా 6,28,586 కిలో మీటర్లు బస్సులు తిప్పి 4,36,189 ప్రయాణికులను చేరవేసి రూ.6,29,94,460 ఆదాయం పొందింది. 12 రోజుల పాటు సురక్షితంగా బస్సులు నడిపి క్షేమంగా భక్తులను చేరవేసింది. అధికారులు బస్ స్టేషన్లో ఉండి భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు సమకూర్చుకుంటూ వెంట వెంటనే చేరవేశారు.
2 నుంచి స్లాట్ బుకింగ్
కొడకండ్ల : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లోనూ వచ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ డి.ఫణిందర్ తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కొడకండ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కూడా ఆస్తులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుకింగ్ విధానం అమలవుతుందని, ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి చేసి దస్తావేజులు అందజేస్తామన్నారు. రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయని, స్లాట్ బుకింగ్ తమ వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ కిశోర్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక బస్సుల వివరాలు,
వచ్చిన ఆదాయం (రూ.లలో)..
తేదీ ట్రిప్పులు భక్తులు ఆదాయం
15న 166 13,877 14,14,083
16న 212 15,410 19,15,312
17న 270 21,999 28,89,795
18న 439 39,597 5353158
19న 364 34,237 44,81,904
20న 320 26,643 35,86,130
21న 300 24,816 33,43,466
22న 376 31,612 45,02,242
23న 461 45,609 63,01,693
24న 680 61,237 92,33,941
25న 780 64,454 1,07,95,477
26న 679 56,698 91,77,259

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..