పిడుగుపాటు.. ముందే తెలుసుకోవచ్చు | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటు.. ముందే తెలుసుకోవచ్చు

May 28 2025 11:57 AM | Updated on May 28 2025 11:57 AM

పిడుగుపాటు.. ముందే తెలుసుకోవచ్చు

పిడుగుపాటు.. ముందే తెలుసుకోవచ్చు

‘దామిని’ యాప్‌ ద్వారా ప్రమాదాన్ని

ముందే పసిగట్టొచ్చు

ఎరుపు, పసుపు, నీలి రంగుల ద్వారా ఎంత సమయంలో పిడుగు పడుతుందనే సమాచారం

ప్లేస్టోర్‌లో అందుబాటులో‘ దామిని’ యాప్‌

సంగెం: అకాల వర్షాలు, వానాకాలంలో పిడుగులు పడి మూగజీవాలు, ప్రజలు మృతి చెందడం మనం చూస్తుంటాం. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజాజీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఉరుములతో కూడిన వర్షాలతో పాటు పిడుగుపాటుతో ప్రా ణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఏటా పిడుగుపాటుకు గురై అధిక సంఖ్యలో మూగజీవాలు, ఎ క్కువ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిడుగు పాటుపై పరిశోధనలు చేసిన భారత వా తావరణ శాఖ పిడుగు పడడాన్ని ముందే పసిగట్టేందుకు ఓ యాప్‌ను ఆవిష్కరించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాఫికల్‌ మెటరాలజీ(ఐఐటీఎం) ‘దామిని’ యాప్‌ను రూపొందించింది.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

స్మార్ట్‌ఫోన్‌ కలిగిన ప్రతీ ఒక్కరు ప్లేస్టోర్‌ నుంచి ‘దామిని’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ తెరిచి పేరు, మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌, పిన్‌కోడ్‌ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్‌ లోకేషన్‌ కోసం యాప్‌ను వినియోగించే సమయంలో మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో, లేదో మూడు రంగుల్లో చూపిస్తుంది.

ఎరుపు రంగు..

● మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్‌ ఎరుపు రంగులోకి వస్తుంది.

పసుపు రంగు..

● మీరు ఉన్న ప్రాంతంలో 10 నుంచి 15 నిమిషాలలోపు పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్‌ పసుపు రంగుగా మారుతుంది.

నీలం రంగు..

● మీరు ఉన్న ప్రాంతంలో 18 నుంచి 25 నిమిషాలలోపు పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్‌ నీలం రంగులో కనిపిస్తుంది.

మీకు తెలుసా..

?

పాటించాల్సిన జాగ్రత్తలు

నల్ల మబ్బులు ఆకాశమంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్న సమయంలో రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల్లోకి లేక తాము ఉన్న చోటనే మోకాళ్లపై కూర్చుని రెండు చెవులు మూసుకోవాలి.

బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొబైల్‌ సిగ్నల్స్‌ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తాయి. మబ్బులు ఉన్న సమయంలో పంట పొలాల్లో మొబైల్‌ వినియోగించకపోవడం మంచిది.

విద్యుత్‌ స్తంభాలు, సెల్‌ఫోన్‌ టవర్లు, బోర్‌పంప్‌ సెట్లకు దూరంగా ఉండాలి. బోరు మోటార్ల నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో వినియోగించొద్దు.

పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి.

పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement