
వినతులు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ● ప్రజావాణికి 122 వినతులు
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. వినతి ఇచ్చిన 15 రోజుల్లోపే సమస్య పరిష్కారం చేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. కాగా ప్రజావాణిలో 122 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, సీపీఓ సుబ్బారావు, డీఏఓ విజయనిర్మల, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.