
ఏడుగురు మట్కా బీటర్లు అరెస్ట్
కోడుమూరు రూరల్: మట్కా నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులతో పాటు, ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. కోడుమూరుకు చెందిన బోయ వీరరాజనాయుడు, బోయ రెడ్డి రాజు, లింగ బలిజ విజయకుమార్, బోయ దివాకర్, కల్లపరి నాగేష్, బోయ కాశీతో పాటు, గీత అనే మహిళ పత్తికొండ రోడ్డులోని ఖాళీస్థలంలో మాట్కా ఆడుతుండగా సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నామ న్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 మట్కా చీటీలతో పాటు, రూ.2,30,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. యువత మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.