పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత | - | Sakshi
Sakshi News home page

పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత

Jun 7 2025 1:34 AM | Updated on Jun 7 2025 1:34 AM

పర్వత

పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత

కర్నూలు(సెంట్రల్‌): మార్గదర్శి–బంగారు కుటుంబం(పీ4) పథకం కింద పర్వతారోహకుడు గోనెగండ్లకు చెందిన సురేష్‌కు అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ఇచ్చిన రూ.4 లక్షల చెక్కును కలెక్టర్‌ తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పీ4 పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి–బంగారు కుటుంబం ద్వారా పేదలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు రాజా మహేంద్రనాథ్‌, అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ ప్రతినిధులు లక్ష్మీకాంత్‌, శ్రీధర్‌, సీపీఓ హిమప్రభాకర రాజు పాల్గొన్నారు.

బస్టాండ్‌లో వృద్ధుడి మృతి

డోన్‌ టౌన్‌: స్థానిక కొత్త బస్టాండ్‌లో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ప్రయాణికులు గుర్తించి ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విద్యార్థి సంఘం నాయకుడు శివన్న విషయం తెలుసుకుని స్ఫూర్తి సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సంస్థ వ్యవస్థాపకులు మధు అక్కడికి చేరుకుని మృతదేహం వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా శ్రీశైలంకు చెందిన వెంకటేష్‌ నాయక్‌(52)గా గుర్తించారు. మృతుని కుమారునికి, భార్యకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. మూడు రోజులుగా బస్టాండ్‌ ఆవరణలో ఉన్న వృద్ధుడు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

వేలంలో

రూ.5.20 లక్షల ఆదాయం

బనగానపల్లె రూరల్‌: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయంలో తలనీలాల సేకరణ హక్కు కోసం శుక్రవారం నిర్వహించిన బహిరంగవేలం ద్వారా రూ.5.20 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ కామేశ్వరమ్మ తెలిపారు. మొత్తం నలుగురు డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. అవుకు మండలానికి చెందిన పుల్లయ్య అత్యధికంగా పాడి దక్కించుకున్నట్లు చెప్పారు. పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రారెడ్డి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

జేసీబీని ఢీకొన్న కారు

కొలిమిగుండ్ల: స్థానిక తాడిపత్రి రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న జేసీబీని ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. తాడిపత్రి వైపు నుంచి వస్తున్న కారు కొలిమిగుండ్లకు చేరుకోగానే రోడ్డు పక్కనే ఓ హోటల్‌కు చెందిన బోర్డుతో పాటు ఆగి ఉన్న జేసీబీని బలంగా ఢీకొనడంతో ఇన్నోవా కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.

పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత 1
1/2

పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత

పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత 2
2/2

పర్వతారోహకుడికి అర్సెల్‌ మిట్టల్‌ కంపెనీ చేయూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement