
ఆర్టీ‘ఛీ’ బస్టాండ్
ఉలిందకొండ ఆర్టీసీ బస్టాండ్
దివంగత నేత, మాజీ మంత్రి బీవీ మోహన్రెడ్డి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న హయాంలో తన సొంత గ్రామమైన ఉలిందకొండ ప్రజల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. కానీ ఇప్పుడు బస్సులు లేక ఎక్కడికక్కడే మురికి కుంటలుగా నీరు, బస్టాండ్ అంతా తాగుబోతులకు అడ్డాగా మారింది. మద్యం సీసాలు, గ్లాసులు, చెత్తకుప్పలతో దర్శనమిస్తూ దుర్గంధం వెదజల్లుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం బీవీ మోహన్రెడ్డి కుమారుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. ప్రజల కోసం ఉలిందకొండ బస్టాండ్ను అందుబాటులోకి తీసుకురావాలి .
– సాక్షి ఫొటోగ్రాఫర్. కర్నూలు
అపరిశుభ్రంగా..

ఆర్టీ‘ఛీ’ బస్టాండ్

ఆర్టీ‘ఛీ’ బస్టాండ్