
ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమ తరహాలో చేపడుదాం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయాన్ని ఈ ఏడాది ఉద్యమ తరహాలో చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశమందిరంలో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అన్ని శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలన్నారు. ప్రకృతిలోని సహజవనరుల ఆధారంగా సాగు చేసే విధానమైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్పై లోతైన అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.