
ఎన్డీయే కూటమి మార్కేది
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించారు. ప్రజా సంక్షేమాన్ని గాడిలో పెట్టి అనేక సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల వారికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఫీజులు అందించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. కాని నేడు ఎన్డీయే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ప్రజా సంక్షేమ మార్కు అనేది కనిపించడం లేదు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితి.
– ఎండీ ఖాజా, మున్సిపల్ వైస్ చైర్మన్ పెడన