గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

Jun 4 2025 1:25 AM | Updated on Jun 4 2025 1:25 AM

గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టం అమలుపై సమన్వయ శాఖల అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు. బక్రీద్‌ పర్వదినాన్ని గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో మునిసిపల్‌, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్ధక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాల ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం గోవధ నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ ఎం.హనుమంతరావు, డీపీఓ పి.లావణ్యకుమారి, గో సంరక్షణ సమితి ఐకాస సభ్యులు తోట సురేష్‌, నాగలింగం శివాజి, పోతురాజు వినోద్‌రాజ్‌ పురోహిత్‌, గోవిందసాబు, మిరి యాల శ్రీనివాసరావు, బాలకృష్ణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement