
ఉచిత ఇసుక పేరుతో చోటా నాయకుల దందా
కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. అధికార పార్టీ చోటా నాయకులకు ఈ పథకం మంచి ఆదాయ వనరుగా మారింది. కృష్ణానది, మున్నేరు, ఇతర ఉపనదుల్లో ఉచిత ఇసుక పేరుతో పగలు ట్రాక్టర్లు ద్వారా ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్నారు. రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇసుకను కూటమి నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
నందిగామ మండలం కంచలవద్ద
వర్షాకాలం కోసం నిల్వచేసిన ఇసుక