
నాలుగు నియోజకవర్గాల్లో మట్టి మాఫియా
ప్రకృతి సంపదలో ఒకటైన మట్టిపై కొంతమంది టీడీపీ నేతల కన్నుపడింది. చెరువులు, కుంటలను ఎంచుకుని రాత్రి వేళల్లో పొక్లెయిన్లతో లోతుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు ఆ మట్టిని ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్ల మెర కకు తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా పొలాలను మెరక చేసుకునేందుకు రైతుల నుంచి వసూలు చేసి మట్టిని అమ్ముతున్నారు. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పేరకలపాడు, గండేపల్లి, పరిటాల, గొట్టుముక్కల చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు, జయంతి, చట్టన్న వరం తదితర గ్రామాలు, మైలవరం నియోజక వర్గంలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్మహ్మద్పేట, పెనుగంచిప్రోలు మండలం, వత్సవాయి మండలం, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.