
5న పెడనలో జాబ్మేళా
పెడన: ఈనెల 5వ తేదీన పెడన బొడ్డునాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. జాబ్మేళా గోడపత్రికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.కార్పొరేషన్ కో ఆర్డినేటర్ వంగా బాబు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ, బిఫార్మసీ పూర్తి చేసినవారు హాజరుకావచ్చన్నారు. ఇతర వివరాలకు సెల్నంబర్లు 8897772488, 9966489796, 9989519495 సంప్రదించాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పాల్గొన్నారు.
రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నంలోని 37వ డివిజన్ రాజుపేట చెక్కలమేడ సెంటర్లో ఉన్న 7వ నంబర్ చౌక ధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీని మంత్రి రవీంద్ర ఆదివారం పునఃప్రారంభించారు. కార్డుదారులకు ఐదు కిలోల బియ్యం, అర కిలో పంచదార, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అదేప్రాంతానికి చెందిన వృద్ధులు బోయిన సుశీల, గొడవర్తి మహాలక్ష్మి ఇళ్లకు వెళ్లి వారికి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. డిఎస్ఓ పార్వతి, డీఎం శిరీష, ఆర్డిఓ కే స్వాతి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ కౌన్సిలర్ రాయపూడి చిన్ని, తహసిల్దారు పి.మధుసూదన్రావు, డీలర్ సైకం సాంబమూర్తి పాల్గొన్నారు.

5న పెడనలో జాబ్మేళా