
ప్రారంభోత్సవం విజయవంతం చేయాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు
రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన జాతీయ రహదారి ప్రారంభోత్సవం విజయవంతం చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద బుధవారం సభాస్థలి వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవా ణాను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్ర భుత్వం సుమారు రూ.3500 కోట్లతో నాలుగు వరుసలతో జాతీయ రహదారి నిర్మించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా మే 5న కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఎన్హెచ్– 363 ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణికుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా బసవేశ్వర మహరాజ్ జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బసవేశ్వర మహరాజ్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బసవేశ్వర మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్, లింగాయత్ సంక్షేమ సంఘం ప్రతినిధులు దీకొండ సతీశ్కుమార్, వాసుదేవన గిరీశ్కుమార్, భద్రయ్య, సభ్యులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం విజయవంతం చేయాలి