
ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను శనివా రం జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఆలయ గౌరవాధ్యక్షుడు జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావ్తో కలిసి ఆవిష్కరించారు. జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని కో రారు. అంతకు ముందు ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురుస్వాములు, స్వాములు, భక్తులతో జెడ్పీటీసి అరిగెల నాగేశ్వర్రావ్ హనుమాన్ జయంతి, శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఒజ్జల శిరీష్శర్మ, కమిటీ సభ్యులు పిన్నా వివేక్, వెంకటేశ్వర్లు, ఎకిరాల శ్రీనివాస్, మురళీగౌడ్, తుపాకి వెంకన్న, ప్రకాష్గౌడ్, రూప్నార్ రమేష్ పాల్గొన్నారు.