ప్రతిపాదనలతోనే సరి.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలతోనే సరి..

Jun 7 2025 12:10 AM | Updated on Jun 7 2025 12:10 AM

ప్రతి

ప్రతిపాదనలతోనే సరి..

● మరమ్మతులకు నోచుకోని వసతిగృహాలు ● పలు భవనాల్లో పైకప్పు లీకేజీలు, దెబ్బతిన్న గోడలు, మరుగుదొడ్లు ● వేసవి సెలవుల్లో దృష్టి సారించని యంత్రాంగం

చిన్నచిన్న పనులైనా చేయించాలి

చాలా హాస్టళ్లలో బాత్‌రూమ్‌లకు తలుపులు, గదుల్లో కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొన్నిచోట్ల పడుకునే పరిస్థితి లేదు. చిన్నచిన్న మరమ్మతులైనా చేయిస్తే విద్యార్థులకు కాస్త ఉపశమనంగా ఉంటుంది.

– వంగూరి వెంకటేష్‌, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి

మళ్లీ పాత సమస్యలే..

నూతన విద్యాసంవత్సరంలో వచ్చే విద్యార్థులకు హాస్టళ్లలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవుల్లో మరమ్మతులపై ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో వర్షాకాలంలో ఇబ్బంది ఎదురుకానుంది.

– ఇటికాల రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌, జిల్లా కార్యదర్శి

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల భవనాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కొన్ని భవనాలు మరమ్మతుకు గురి కాగా.. మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. భవనాల పైకప్పులకే లీకేజీలు, గోడలన్నీ పెచ్చులూడి, కిటికీలు దెబ్బతినడంతో పాటు విద్యుత్‌ వైరింగ్‌ సరిగా లేక విద్యార్థులు గత ఏడాదంతా అవస్థ పడ్డారు. అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల భవనాలను వేసవి సెలవుల్లో మరమ్మతు చేయించాలని ప్రతిపాదించగా ఎలాంటి స్పందన కానరాలేదు. దీంతో ఈనెల 12న వసతిగృహాలు తెరుచుకోనుండగా మళ్లీ విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి.

ప్రతిపాదనలు ఇలా

జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో మరమ్మతులకు అధికారులు రూ.20.20లక్షలతో అంచనాలు రూపొందించారు. అలాగే, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మధిర ఎస్‌టీహెచ్‌(షెడ్యూల్‌ ట్రైబ్‌ హాస్టల్‌), ముదిగొండ మండలం వల్లభిలోని ఆశ్రమ పాఠశాల, తిమ్మారావుపేట ఎస్‌టీహెచ్‌, ఖమ్మం, ఖమ్మంరూరల్‌ పోస్ట్‌మెట్రిక్‌ కాలేజీల్లోనూ మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించారు. ఎస్సీ వసతి గృహాల్లోనూ వసతులు సక్రమంగా లేవు. జిల్లాలో మొత్తం 52 వసతి గృహాలకు గాను 49 ప్రభుత్వ భవనాల్లో, మిగిలిన మూడు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో మరమ్మతులకు రూ.2,42,11,000 అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించారు.

సెలవులు వృథా

వసతిగృహాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులే వసతి పొంది చదువుకుంటారు. ఏటా చిన్నచిన్న మరమ్మతులు చేయించాల్సి ఉన్నా కొన్నేళ్లుగా పట్టించుకోకపోవడంతో సమస్యల తీవ్రత పెరిగింది. కొన్ని వసతిగృహాల్లో స్లాబ్‌ కురుస్తుండగా రిపేర్‌ చేయించకపోవడంతో ప్రస్తుతం పెచ్చులు ఊడి పడుతున్నాయి. వేసవిలో 50 రోజుల సెలవులు వచ్చినా భవనాల మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం వహించడం గమనార్హం. కొన్ని వసతిగృహాల్లో బాత్‌రూమ్‌లకు తలుపులు కూడా లేవని, మరికొన్ని భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని చెబుతున్నారు.

నిర్మాణానికి ఆదేశాలు

జిల్లాలో శిథిలావస్థకు చేరిన మూడు బీసీ సంక్షేమ వసతిగృహాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి బీసీ సంక్షేమశాఖ నిధులను మంజూరు చేసింది. ఒక్కో హాస్టల్‌కు రూ.3 కోట్ల చొప్పున మూడింటికి రూ.9 కోట్లు మంజూరయ్యాయి. ఖమ్మం ముస్తఫానగర్‌లోని బీసీ బాయ్స్‌ హాస్టల్‌, జహీర్‌పురలో బీసీ గర్ల్స్‌ హాస్టల్‌, రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని బీసీ హాస్టళ్లకు భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ మూడు భవనాలు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

జిల్లాలోని వసతిగృహాల వివరాలు

సంక్షేమశాఖ వసతిగృహాలు

బీసీ 33

ఎస్సీ 52

ఎస్టీ 30

ప్రతిపాదనలతోనే సరి..1
1/3

ప్రతిపాదనలతోనే సరి..

ప్రతిపాదనలతోనే సరి..2
2/3

ప్రతిపాదనలతోనే సరి..

ప్రతిపాదనలతోనే సరి..3
3/3

ప్రతిపాదనలతోనే సరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement