పెరిగిన ఎండ తీవ్రత | - | Sakshi
Sakshi News home page

పెరిగిన ఎండ తీవ్రత

Jun 6 2025 6:25 AM | Updated on Jun 6 2025 6:25 AM

పెరిగిన ఎండ తీవ్రత

పెరిగిన ఎండ తీవ్రత

ఖమ్మంవ్యవసాయం: ఎండ తీవ్రత పెరిగింది. గురువారం అత్యధికంగా తల్లాడ మండలం కుర్నవల్లిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 40.1 డిగ్రీలుగా నమోదు కాగా, తల్లాడలో 39.9, వైరాలో 39.8, పల్లెగూడెం, గౌరారంలో 39.6, కాకరవాయిలో 39.5, వైరా ఏఆర్‌ఎస్‌ వద్ద 39, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌, పెద్దగోపతిలో 38.9, ముదిగొండ, ఎర్రుపాలెంలో 38.8, పమ్మి, కల్లూరు, పెనుబల్లిలో 38.7, వేంసూరు, చింతకానిలో 38.6, కొణిజర్ల, బాణాపురం, ఏన్కూర్‌లో 38.4, నేలకొండపల్లి, మధిరలో 38.3, మధిర ఏఆర్‌ఎస్‌, ఖమ్మం ఖానాపురం, సత్తుపల్లి ఓసీల వద్ద 38.2, సత్తుపల్లి, రావినూతల, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌ వద్ద 38.1, సదాశివునిపాలెంలో 38, గేటుకారేపల్లి, రఘునాథపాలెం, లింగాల, సిరిపురంలలో 37.9, కూసుమంచి, నాగులవంచ, గంగారం, పంగిడి, తిరుమలాయపాలెంలో 37.8, తిమ్మారావుపేట 37.7, గుబ్బగురి, మంచుకొండలలో 37.5, ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా.. రైతులు మాత్రం పంటల సాగుకు దుక్కలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement