
మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి
సత్తుపల్లి: మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు స్థానిక తామరచెరువు వద్ద అటవీ ప్రాంతంలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని విద్యానగర్ రోడ్డుకు చెందిన ఎస్కె.ఖాదర్బీ(70) మతిస్థిమితం లేకపోవడంతో తామరచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. దీంతో అటవీశాఖ ఉద్యోగులు ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి