
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
కొణిజర్ల: కారు. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ వెల్ల డించిన వివరాల మేరకు... ఏపీలోని చింతలపూడి నుంచి శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్న కారును తనికెళ్ల సమీపాన ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అంతేకాక కొణిజర్ల నుంచి ఖమ్మం వెళ్తున్న ఆటోనూ ఢీకొట్టడంతో బోల్తా పడింది. కారు డ్రైవర్ కోడూరి సునీల్, అందులో ఉన్న చింతలపూడికి చెందిన వెంకటేశ్వరరావు, పార్వతికి గాయలయ్యాయి. అలాగే, ఆటోడ్రెవర్ చింతకాని మండలం నేరడకు చెందిన తాటి లోకేష్, కొణిజర్లకు చెందిన పందిళ్ల వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి గాయపడ్డారు. అయితే, ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ రోడ్డుపైనే వాహనం వదిలేసి పరారయ్యాడు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి రాకపోకలు క్రమబద్ధీకరించారు.
ఉరి వేసుకుని ఆత్మహత్య
చింతకాని: మండలంలోని పొద్దుటూరుకు చెందిన తుడుం ఎల్లేష్(33) ఉరి వేసుకుని బలవన్మరణానికి బలపడ్డాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆయన కరెంట్ వైరుతో దూలానికి ఉరి వేసుకున్నాడు. ఎల్లేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఖమ్మంలో యువతి...
ఖమ్మంక్రైం: ఖమ్మం జూబ్లీ క్లబ్ సమీపంలో నివసిస్తున్న బంక కస్తూరి(25) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. ఆమె తల్లి ఇచ్చిన సమాచారంతో ఖమ్మం త్రీటౌన్ పోలీసులు పరిశీలించారు. కస్తూరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.