
పెద్దమ్మతల్లి హుండీ ఆదాయం రూ.23.42 లక్షలు
పాల్వంచరూరల్: పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఈసందర్భంగా 80 రోజులకు గాను రూ.23,42,780 నగదుతో పాటు విదేశీ కరెన్సీ, మిశ్రమ బంగారం, వెండి లభ్యమయ్యాయని ఈఓ రజినీకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవా దాయ శాఖ పర్యవేక్షణాధికారి జి.సుదర్శన్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
అమ్మవారికి సువర్ణ పుష్పార్చన..
శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు.