
రైతులకు అండగా ‘సాక్షి’
నేడు డీఏఓ, శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్
ఖమ్మంవ్యవసాయం: నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, దుక్కులు దున్నడంలో జాగ్రత్తలు, మేలైన విత్తనాల ఎంపిక, నకిలీల బారిన పడకుండా కాపాడుకోవడం తదితర అంశాలపై అవగాహన కోసం రైతులకు ‘సాక్షి’ అండగా నిలవనుంది. రైతులు తమ సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం నేరుగా జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, కేవీకే శాస్త్రవేత్తలతో మాట్లాడేలా ‘ఫోన్ ఇన్’ నిర్వహిస్తోంది. ఈమేరకు అన్నదాతలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
తేదీ : 30–05–2025, శుక్రవారం (నేడు)
సమయం : ఉదయం 9నుంచి
10 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్
89777 47500

రైతులకు అండగా ‘సాక్షి’