
‘ఎర్లీబర్డ్’తో కేఎంసీకి రూ.9.69 కోట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఎర్లీ బర్డ్ పథకం ద్వారా ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన ఖమ్మం మున్సి పల్ కార్పొరేషన్కు కలిసొచ్చింది. ఎర్లీబర్డ్ పథకం బుధవారం ముగియగా కేఎంసీకి రూ.9.78 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సెల్ఫ్ అసెస్మెంట్ల ద్వారా రూ.9.68 లక్షలు, పన్నుల చెల్లింపు ద్వారా రూ.9.69 కోట్లు ఆదాయం నమోదైంది. మొత్తం 15,500 భవనాలకు సంబంధించిన పన్ను యజమానులు చెల్లించారు. 2024 ఏప్రిల్లో ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీం ద్వారా కేఎంసీకి రూ.9.25 కోట్లు రాగా.. ఈ ఏడాది అది రూ.9.69 కోట్లకు పెరిగింది. కాగా, చివరి రోజైన బుధవారం రూ.1.17 కోట్ల మేర పన్నులను కేఎంసీ ఉద్యోగులు వసూలు చేశారు.