కాలువలకు సత్వరం నీరు అందించండి | - | Sakshi
Sakshi News home page

కాలువలకు సత్వరం నీరు అందించండి

Jun 8 2025 12:42 AM | Updated on Jun 8 2025 12:42 AM

కాలువలకు సత్వరం నీరు అందించండి

కాలువలకు సత్వరం నీరు అందించండి

హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 25 టీఎంసీల నీరు నిల్వ ఉన్న వెంటనే ఆయకట్టు కాలువలకు నీటిని విడుదల చేస్తే, రైతులకు మేలు జరగడంతో పాటు జలాశయం భద్రతకు కూడా మేలు అని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ అన్నారు. ఇప్పటికే జలాశయంలో 22 టీఎంసీల నీరు నిల్వ అవుతున్నాయి. ఎగువన మంచి వర్షాలు కురుస్తున్నందున జలాశయానికి నీరు పుష్కలంగా అందుతోంది. ఈనేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై వచ్చే ఏడాది మార్చి వరకు రైతులకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, తరువాత ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక పిటిషన్‌ సమర్పించారు. వారు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే 3 రాష్ట్రాల రైతుల తరఫున నిరసన చేపడతామని హెచ్చరించారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు జలాశయపు 19వ గేటు కొట్టుకుపోయినప్పడు వచ్చే ఏడాది జలాశయం 33 గేట్లను కొత్తగా తయారు చేసి బిగించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని తుంగభద్ర రైతు సంఘం ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో సంబంధిత అధికారులకు సంఘం ఒక అభ్యర్థనను సమర్పించింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. టెండర్‌ మంజూరు చేసినా వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త గేట్లు తయారు చేసి బిగించడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.తుంగభద్ర జలాశయం గేట్లు మంచి నాణ్యతతో లేనందున, ఈ సంవత్సరం జలాశయంలో 80 శాతం మేర నీరు మాత్రమే నిల్వ చేసేందుకు వీలు ఉంటుందని సమాచారం. కొంచెగేరి దొడ్డమల్లప్ప, దరూరు ఎం.వీరభద్ర నాయక్‌, ఎం.రామాంజిని నాయక్‌, కురుబర గాదిలింగమూర్తి, అంగడి రాజాగౌడ, బసవనగౌడ, రైతు సంఘం బాధ్యులు హాజరై వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement