అలరించిన ముగ్గుల పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన ముగ్గుల పోటీలు

Jun 7 2025 1:06 AM | Updated on Jun 7 2025 1:06 AM

అలరిం

అలరించిన ముగ్గుల పోటీలు

రాయచూరు రూరల్‌: జిల్లా సాహిత్య లోకానికి మున్నూరు కాపు సమాజం మద్దతు ఇవ్వడం అభినందనీయమని సీనియర్‌ కవి భగత్‌రాజ్‌ నిజాంకారి పేర్కొన్నారు. గురువారం నగరంలోని వీరాంజనేయ ఆలయంలో ఏర్పాటు చేసిన అఖిల భారత ముంగారు మున్నూరు కాపు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన కవిగోష్టిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నాడు శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల పాటు ముంగారు ఉత్సవాలను చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. వృషభం, మాతా లక్ష్మీదేవి, రైతులు, వెంకటేశ్వరుడు, పల్లె వాతావరణం ఉట్టి పడేలా ముగ్గులు వేశారు. మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటేష్‌, కృష్ణమూర్తిలున్నారు.

అలరించిన ముగ్గుల పోటీలు 1
1/2

అలరించిన ముగ్గుల పోటీలు

అలరించిన ముగ్గుల పోటీలు 2
2/2

అలరించిన ముగ్గుల పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement