
1న ప్రతిభా పురస్కారాలు ప్రదానం
సాక్షి,బళ్లారి: కర్ణాటక వీరశైవ లింగాయత్ ఉద్యోగుల క్షేమాభివృద్ధి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూన్ 1న సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు చెన్నబసవస్వామి గురువారం వివరాలు వెల్లడించారు. 10వ తరగతి, పీయూసీలో 85శాతం పైగా మార్కులను తెచ్చుకున్న వారిని సన్మానించి, పురస్కారం అందజేస్తామన్నారు. ఇప్పటికే 10వతరగతి విద్యార్థులు 130 మంది, పీయూసీ విద్యార్థులు 135 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. సమావేశంలో బసవరాజు బిసలహళ్లి,ఎస్పీ జగదీష్,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: గాణిగ సమాజం ఆధ్వర్యంలో జూన్ 1న ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేయనుననట్లు ఆ సముదాయం అధ్యక్షుడు చెన్నప్ప తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెన్త్, పీయూసీలో ఉత్తమ మార్కులు సాధించిన సముదాయానికి చెందిన విద్యార్థులకు నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. బసప్పహళి, శంకరప్ప, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

1న ప్రతిభా పురస్కారాలు ప్రదానం