
రిమ్స్లో అదనపు నియామకాలు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో గైర్హాజరైన అప్రెంటీస్ వైద్య విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రగతిశీల సంఘం వేదిక అధ్యక్షుడు రాజు పట్టి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గత ఏదాడి జనవరిలో త్రిశూల్ నాయక్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఏడాది పాటు అప్రెంటిస్గా రిమ్స్లో పని చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా నియమాలను గాలికొదిలి గైర్హాజరై ఐఏఎస్ కోచింగ్ కోసం న్యూఢిల్లీలో ఉన్నాడన్నారు. మరో వైపు జీవ రసాయన శాస్త్రం బోధించడానికి రిమ్స్ కళాశాలలో ట్యూటర్గా నెలకు రూ.40 వేల చొప్పున వేతనం పొందారని తెలిపారు. త్రిశూల్ నాయక్ తండ్రి శాసన సభ్యుడి కుమారుడు కావడంతో డీన్ రమేష్ ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. నేత్ర విభాగంలో కృష్ణయ్య ఆడియోమెట్రిగా ఉన్నా అదనంగా జిల్లాధికారి భార్య దీపికను నియమించారని ఆరోపించారు. ఈ విషయంలో అప్రెంటిస్ వైద్య విద్యార్థిపై, డీన్ రమేష్, దీపికలపై చర్యలు చేపట్టాలని ఆయన ఒత్తిడి చేశారు. సభ్యులు బేరి, నరసింహులు, చంద్రశేఖర్, భాస్కర్, శ్రీనివాసులున్నారు.