ప్లాస్టిక్‌ వ్యర్థాలను అరికడదాం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాలను అరికడదాం

Jun 6 2025 1:10 AM | Updated on Jun 6 2025 1:10 AM

ప్లాస

ప్లాస్టిక్‌ వ్యర్థాలను అరికడదాం

కరీంనగర్‌ టౌన్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ వ్యర్థాలను అరికడదాం.. పర్యావరణం కాపాడుదాం అనే శక్తివంతమైన నినాదంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కరీంనగర్‌, గైనకాలజికల్‌ సొసై టీ సంయుక్తంగా వేడుకలు నిర్వహించా యి. ఐ ఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌ ఎనమల్ల, కార్యదర్శి డాక్టర్‌ సిరిపురం నవీన్‌కుమార్‌, కోశాధికారి డాక్టర్‌ చల్లా విజయ్‌కుమార్‌, గైనకాలజీ అసోసియేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎల్‌.స్రవంతి, కోశాధికారి డాక్టర్‌ స్వప్న నాయకత్వంలో హరితహారం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. సీనియర్‌ డాక్టర్లు బి.ఎన్‌.రావు, మోహన్‌రెడ్డి, కిషన్‌, అలీమ్‌, లక్ష్మణ్‌, అరుణ్‌ కాటారి పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ను నిషేధించాలి

కరీంనగర్‌: ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్‌ను నిషేధించాలని డీఈవో శ్రీరామ్‌ మొండయ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌ వద్ద పర్యావరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. వినియోగదారులకు ‘ప్లాస్టిక్‌ బ్యాగులను ఉపయోగించకండి– బట్ట సంచులను వాడండి’ అనే సందేశంతో బట్ట సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకంతో కేన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు కలగవచ్చని హెచ్చరిస్తూ, మార్పు మీ నుండే మొదలవుతుందన్నారు. సీడీ రామస్వామి, మానసిక నిపుణులు కేఎస్‌.అనంతాచార్య ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీ నిర్వహించారు. జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ జయపాల్‌రెడ్డి, ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ మిలుకూరి శ్రీనివాస్‌, అశోక్‌రెడ్డి, అంజనేయులు, సైన్స్‌ ఫోరమ్‌ ప్రతినిధులు దామోదర్‌, అంజనేయులు పాల్గొన్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ భగత్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని భగత్‌నగర్‌, ఎర్రగుట్ట, వేంకటేశ్వర, విఘ్నేశ్వర, వాసుదేవ, న్యూశ్రీనగర్‌కాలనీల్లో, కట్టరాంపూర్‌ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ గౌతమినగర్‌ ఫీడర్‌ పరిధిలోని మహాలక్ష్మినగర్‌, శ్రీనివాసనగర్‌, జయశంకర్‌కాలనీ, శాతవాహన ఫార్మా మెడికల్‌ కళాశాల, చర్చి, తిరుమల్‌నగర్‌, కట్టరాంపూర్‌, బ్లూబెల్స్‌ స్కూల్‌ ప్రాంతాలు, కొత్త డీటీఆర్‌ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీరాంనర్‌ రోడ్‌ నెంబర్‌ 5,6,7, శ్రీరాంనగర్‌, ఆదిత్యనగర్‌, సాలంపుర, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, శాతవాహన యూనివర్సిటీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు పనులు, నూతన డీటీఆర్‌ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్‌ పరిధిలోని డీమార్ట్‌, వరలక్ష్మి గార్డెన్‌, తులసీనగర్‌, హెచ్‌పీ గ్యాస్‌ గోదాం, రెడ్డి ఫంక్షన్‌హాల్‌ వెనుక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

కొత్తపల్లిలో..

విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు మధ్యస్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొత్తపల్లి(హెచ్‌), రాణిపూర్‌లలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌రూరల్‌ ఏడీఈ గాదం రఘు వివరించారు.

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 15మంది గైర్హాజరు

కరీంనగర్‌: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మూడో రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో 52 మంది విద్యార్థులకు 37 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్‌ మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలను ప్రత్యేక తనిఖీ బృందంతో పాటు డీఈవో, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌లు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలను అరికడదాం
1
1/1

ప్లాస్టిక్‌ వ్యర్థాలను అరికడదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement