
భూభారతితో సమస్యలు పరిష్కారం
కరీంనగర్రూరల్/కొత్తపల్లి: కొత్త రెవెన్యూచట్టం భూభారతి ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. అర్జీల వివరాలు రిజిష్టర్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, కరీంనగర్, కొత్తపల్లి తహసీల్దార్లు ఎన్.రాజేశ్, ఆర్.వెంకటలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ వైశాలి, ఆర్ఐలు వాస్తవిక్గౌడ్, కనకరాజు, స్థానిక నాయకులు సుంకిశాల సంపత్రావు, తోట తిరుపతి, మంద రాజమల్లు, ఊరడి మల్లారెడ్డి, బుర్ర హరీశ్గౌడ్, గాజుల అంజయ్య, కె.వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
ఆర్జీల వివరాలు రిజిష్ట్టర్లో నమోదు చేయాలి
కలెక్టర్ పమేలా సత్పతి