
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
కరీంనగర్రూరల్: గ్రామాల్లో బీజేపీ బలోపేతా నికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఎంపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు, కరీంనగర్ సింగిల్విండో డైరెక్టర్ సాయిల్ల మహేందర్, మల్లేశం, తిరుమల్, శ్రీకాంత్ తదితరులు బీజేపీలో చేరగా సంజయ్ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బండి సంజయ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీలో చేరినట్లు సింగిల్విండో డైరెక్టర్ మహేందర్ తెలిపారు. బీజేపీ నాయకులు ఎం.సంతోష్కుమార్, టి.శ్రీనివాస్, డి.రమణారెడ్డి, దీపక్, హరికృష్ణ, మోహన్రెడ్డి, రాజు పాల్గొన్నారు.
ఘనంగా ‘సందల్ షరీఫ్’
జమ్మికుంట: మండలంలోని బిజిగిరిషరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సందల్ షరీఫ్(గ్రంథలేపనం) ఉత్సవాన్ని ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్గా సమీపంలోని మొల్లపల్లి, పెద్ద బిజిగిరిషరీఫ్ గ్రామాల నుంచి సందల్ షరీఫ్(గ్రంథలేపన), చాదర్లను భక్తిశ్రద్ధలతో ఆదివారం వేకువజామున దర్గాకు తీసుకొచ్చారు. దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అక్బర్షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావలి రహమతుల్లాఅలై సమాధులకు సందల్ అలంకరింపజేసి ,చాదర్లు సమర్పించారు. మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్, సంయుక్త కార్యదర్శి నయీమొద్దీన్ పాల్గొన్నారు.
బాక్సింగ్ జట్టు ఎంపిక
కరీంనగర్స్పోర్ట్స్: నిజామాబాద్ జిల్లాలో ఈనెల 10,11వ తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లాజట్టు ఎంపిక పోటీలను ఆదివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాకారులు హాజరుకాగా.. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. జి.హరిహర, కె.నరేశ్, పి.సుకుమార్, జి.సాకేత్, సిమ్రితరెడ్డి, శ్రీకర్, పి.సాకేత్, సీహెచ్.వరుణ్, వి.హేమహాసిని, పవిత్ర ఎంపికయ్యారు. డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, సంపత్ పాల్గొన్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి