
‘పద్మ’గ్రహీతలకు అభినందనలు
కరీంనగర్ టౌన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మ విభూషణ్ అందుకున్న దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, పద్మ భూషణ్ అందుకున్న బాలకృష్ణ, పద్మశ్రీ అవార్డు అందుకున్న మాడుగుల నాగఫణి శర్మను అభినందించారు. ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు.
బస్టాండ్లో ఔట్పోస్టు
కరీంనగర్క్రైం: కరీంనగర్ బస్టాండ్లో పోలీసు ఔట్ పోస్టును సోమవారం సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బస్టాండ్లో దొంగతనాల నియంత్రణకు అవుట్పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపా రు. 24గంటల పాటు పోలీసుసిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. టౌన్ ఏసీపీ వెంకట స్వామి, వన్టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై రాజన్న, ఆర్టీసీ అధికారులు ఎస్.భూపతిరెడ్డి, విజయమాధురి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

‘పద్మ’గ్రహీతలకు అభినందనలు